కోల్కతాలోని ఫిక్కి ఇన్వెస్టర్ల సమావేశంలో తెలంగాణ మంత్రుల బృందం పాల్గొంది. ఈ సమావేశానికి కోల్కతాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఐటీ, ప్లాస్టిక్, కెమికల్స్, మౌలికవసతుల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయమైన గమ్యస్థానమన్నారు. ఐటీ రంగంలో ఆఫ్టిక్ ఫైబర్ తయారికి ముందుకొచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథతో ఇవ్వనున్న ఇంటింటికి ఇంటర్ నెట్ కార్యక్రమం అద్భుత అవకాశమని చెప్పారు. అటు తెలంగాణలో పర్యటించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామని పారిశ్రామికవేత్తలు తెలిపారు.