దుర్గం చెరువును హైదరాబాద్ ల్యాండ్ మార్క్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉన్న దుర్గం చెరువకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. దుర్గం చెరువు సుందరీకరణతో పాటు చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కుతుబ్ షాహీల కాలంలో 184 ఎకరాల ఆయకట్టు గల దుర్గం చెరువు కాలక్రమేణా కబ్జాలకు లోనై మురికి కూపంలా మారింది. తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువు అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 187.50 కోట్లు కేటాయించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగర చారిత్రక సంపదను, ప్రకృతి వనరులను కాపడుకొంటామన్నారు.