హైదరాబాద్: వరంగల్లో రేపు జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు తెలంగాణ జిల్లాల నుంచి ట్రాక్టర్లలో వేలాది మంది రైతులు పయనమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 1,450 బస్సులు. 300 ట్రాక్టర్లు, 4 ప్రత్యేక రైళ్లు, 500 లారీల్లో రైతులు, ప్రజలు వరంగల్ సభకు బయల్దేరారు. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లు, వనపర్తి నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో 300 ట్రాక్టర్లు, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం నుంచి 100 ట్రాక్టర్లు నారాయణపేట్ నుంచి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో 350 ట్రాక్టర్లు, దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 250 ట్రాక్టర్లు, కొల్లాపూర్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో 200 ట్రాక్టర్లల్లో రైతులు సభకు హాజరయ్యేందుకు బయల్దేరి వెళ్లారు.