హైదరాబాద్: హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు గోవా నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావుతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి రాష్ట్రపతి ఉస్మానియా యూనివర్సిటీకి బయల్దేరి వెళ్లారు.సాయంత్రం ఇఫ్లూ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొంటారు.