న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రధాని మోదీని కలుసుకున్నారు. అంతకముందు ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తోనూ భేటీ అయ్యారు. ఈనెల 25 నుంచి 29 వరకు విక్రమసింఘే భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఉన్న మత్సకారుల సమస్యపై ప్రధానులు మాట్లాడుకోనున్నారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు.