ఇప్పటికే పుట్టేడు కష్టాల్లో ఉన్న శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. చెన్నైలోని అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏర్పాటు చేసిన శశికళ ఫ్లెక్సీలు, బ్యానర్లను పళని వర్గం తొలగించింది. పన్నీరు సెల్వం డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇరు వర్గాల విలీనానికి అడ్డుంకులు తొలిగిపోయినట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపై స్పంధించిన పన్నీరు వర్గం ఫ్లెక్సీలు తొలగించడం సంతోషంగా ఉందన్నారు. అయితే అధికారికంగా శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాలని కోరింది.