వరంగల్ లో టిఆర్ఎస్ బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నామన్నారు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అడిక్ మెట్, రాంనగర్ డివిజన్ లలో కార్పొరేటర్లు హేమలత, వి. శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో పలుచోట్ల ఆయన కూలీ పని చేశారు. కూలీ పనులకు గాను నాయిని మూడు లక్షల రూపాయలు సంపాదించారు. బహిరంగ సభకు వెళ్లేందుకు దారి ఖర్చులకు ఈ డబ్బును ఉపయోగిస్తామని చెప్పారు.