హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా ఏప్రిల్ 28న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో బాహుబలి-2 చిత్రంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...బాహుబలి-2 బెన్ఫిట్ షోలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 5 షోలకు మాత్రమే అనుమతిని ఇచ్చిందని చెప్పారు. టికెట్లు రేట్లు పెంచడం, కాంబో ఆఫర్స్ పెట్టి, టికెట్లు అమ్మడంపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి తలసాని తెలిపారు. ప్రేక్షకులను ఎలాంటి ఇబ్బంది కలిగినా ఉపేక్షించేది లేదన్నారు.