స్వచ్ఛత విషయంలో పర్యాటకులకు అత్యున్నత స్థాయి ప్రమాణాలు అందించడానికి ఎంపిక చేసిన జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ప్రసిద్ధ కట్టడమైన చార్మినార్కు చోటు దక్కింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగమైన కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ (ఎస్ఐపీ) త్రైమాసిక సమీక్ష సమావేశం కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐసీ రెండోదశలో అభివృద్ధి చేయనున్న పది ఐకానిక్ స్థలాలను కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ప్రకటించారు.వీటిలో చార్మినార్తో పాటు గంగ్రోతి, యమునోత్రి, ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం, గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిస్సి చర్చి, కాన్వెంట్, కాలడిలోని ఆదిశంకరాచార్య నివాసస్థలం, శ్రావణబెనెగళలోని గోమఠేశ్వర్, దేవగఢ్లోని వైద్యనాధ్థామ్, బిహార్లోని గయతీర్థ, గుజరాత్లోని సోమనాథ్ ఆలయం ఉన్నాయి.