హైదరాబాద్ : ఓయూ శతాబ్ధి ఉత్సవాల్లో సీఎం, గవర్నర్ ప్రసంగాలు లేవని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఓయూ గొప్పదనం, విద్యార్థుల త్యాగాల గురించి మాట్లాడనందుకు కేసీఆర్ సిగ్గుపడాలని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి విమర్శించారు. విద్యార్థులంటే కేసీఆర్ ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందని జీవన్ రెడ్డి చెప్పారు. మూడేళ్ల తర్వాత ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ మూగోడిగా వెనుదిరిగారని జీవన్ రెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యతిరేకత ఉందని జీవన్రెడ్డి స్పష్టం చేశారు.