ధర్మపురి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకై గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, రైతులు మధ్య దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేష్ అన్నారు. మండలంలోని నక్కలపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొగిలి లక్ష్మి, ఎంపీటీసీ బాదినేని భీమయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సౌళ్ల భీమయ్య, శేఖర్తోపాటు వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.