వరంగల్ టీఆర్ఎస్ బహిరంగ సభకు తెలంగాణ రైతులు తరలివెళుతున్నారు. సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపేందుకు పోటెత్తిన రైతులకు ఓరుగల్లు స్వాగతం పలుకుతోంది.అన్ని దారులు జన ప్రభంజనంలా వరంగల్ వైపే సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వేలాది ట్రాక్టర్లలో లక్షలాదిగా రైతులు వరంగల్ కు చేరుకున్నారు. మరిన్ని ట్రాక్టర్లు, బస్సులు, లారీలు వరంగల్ సభకు బయలుదేరుతున్నాయి. ఇక వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా రైతుల సందడే కనిపిస్తోంది. సభను విజయవంతం చేయాలన్న ఉత్సాహం రైతుల్లో కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేశారు. కానీ తరలివెళ్తున్న జనప్రవాహం చూస్తుంటే అంచనాలు మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.