భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పామాయిల్ రైతుల కల నిజమైంది. పామాయిల్ రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తైంది. ఎల్లుండి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో అధికారికంగా ట్రయలర్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఒకసారి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అప్పారావు పేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో దాదాపు ఆరువేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.