తెలంగాణ ఉద్యమంలో వరంగల్ నగరానికి విశిష్ఠ స్థానముందని ఎంపీ కవిత అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ నేడు సీఎం కేసీఆర్ పాలన వల్ల రైతుల గుండెల్లో కొలువుతీరిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో నేడు టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ విజయవంతమవుతుందన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితిగా మారిందని చెప్పారు. టిఆర్ఎస్ ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె.. ఏర్పాట్లపై ఆరా తీశారు.అటు యావత్ తెలంగాణ రైతు లోకం ఏకశిలానగరానికి తరలివెళుతోంది. రైతు బాంధవుడికి కృతజ్ఞతగా లక్షల సంఖ్యల్లో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వరంగల్ కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభలో పాల్గొనేందుకు వెళ్లే రైతుల వాహనాలతో జాతీయరహదారులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ గులాబీ మయమైనాయి. సైకిళ్లతో మొదలుకొని… బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు… జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో రైతులు పోటెత్తారు. దీంతో వరంగల్ టు హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి.