సీఎం కేసీఆర్ జిందాబాద్, ముఖ్యమంత్రి జిందాబాద్ నినాదాలు వినపడ్డాయంటే అది అధికార పార్టీ కార్యక్రమం అనుకుంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న మహిళలే సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో దూరిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ నినాదాలు చేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తలే ముఖ్యమంత్రికి జిందాబాద్ కొట్టారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు నాయకత్వం వహించిన ప్రదర్శనలో వాళ్ల వెనకనే ఉన్న మహిళలే సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చూసినా.. వాళ్ల వెనుక ఉన్న కార్యకర్తలకు కూడా అది నచ్చలేదు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్ల మదిలో నిలిచిపోయాయి. అందుకే, సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం విశేషం. హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ నుంచి నాంపల్లిలోని హెచ్చార్సీకి ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు నిర్వహించిన ప్రదర్శనలో ఇది జరిగింది.