ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ రోజు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో పాలకుర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాఘవపురానికి వెళ్లి మిషన్భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం బమ్మెరకు వెళ్లి అక్కడ మహాకవి పోతన సమాధిని సందర్శిస్తారు. తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షనిర్వహిస్తారని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.14 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.కోటి 22 లక్షల విలువైన ట్రాక్టర్లు, ఎక్సైజ్, ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజచేస్తారని ఆమె తెలిపారు.