జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.19 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రధాని నరేంద్రమోడీ రూ.80 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన వివిధ మంత్రిత్వశాఖల అధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.