నూతనకల్ : గడ్డిలోడుతో వెళ్తున్న టాటాఏస్ వాహనానికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు ఎగిసి గడ్డికి నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 24 టీసీ 3849 నెంబర్ గల టాటాఏస్ వాహనంలో గడ్డిని నూతన్కల్ నుంచి లింగంపల్లి గ్రామానికి తరలిస్తుండగా శంబునిచెర్వు వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మంటలులేసి పూర్తిగా దగ్ధమైంది.