కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే గోపీనాథ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి యూసుఫ్ గూడ చౌరస్తాలో దిగ్విజయ్ సింగ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే దిగ్విజయ్ సింగ్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని మాగంటి డిమాండ్ చేశారు.