కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల్లో శనివారం ఏర్పాటు చేసిన మేగా జాబ్ మేళాను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.