భానుపురి, మేజర్న్యూస్: లక్ష్మి గణపతి ఆటో ఫైనాస్స్లో గుమస్తాగా పనిచేస్తున్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ జిల్లా, కారంపుడికి చెందిన వెన్నపూసల శివ(27) సూర్యాపేట జిల్లాకేంద్రంలోని గోగుల్ బార్ ముందు శని వారం దారుణ హత్యకు గురైయాడు. వివరా లకు వెళ్ళేతే గుంటూర్ జిల్లాలోని కారం పుడి లో లక్ష్మిగణపతి ఫైనాన్స్ సూర్యాపేట, నల్గొం డ బ్రాంచ్లో ఆటో ఫైనాస్స్ రికవరి కోసం శివ, నరేష్ లు శనివారం సూర్యాపేటకు వచ్చారు. ఆత్మకూర్(ఎస్) మండలం, కందగట్ల గ్రామాన్నికి జెట్టి లింగయ్య అనే వ్యక్తి ఆటో డబ్బులు ఇవ్వ నందున అతని ఆటోను తీసుకొని వెళ్ళి ఆటో గ్యారేజ్లో పెట్టారు. ఆటోఫైనాస్ డ బ్బులు కడతానని జెట్టి లింగయ్య(ఆటోడ్రైవర్) శివకు ఫోన్ చేసి గోకుల్ బార్ దగ్గరకు ర మ్మని చెప్పి అక్కడి వచ్చిన శివను ఆవేశంతో కత్తితో పోడిచి పారిపో యాడు. అతనిని మెట్రో హస్పటల్ తీసుకేళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పట్టణ పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.