కరీంనగర్- సూర ్యప్రత్యేకప్రతినిధి:ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని ప్రజలను రెచ్చ గొట్టెందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమిటో తెల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని మాజి ఎంపి పొన్నం ప్రభాకర్ నీటి పారుదలశాఖ మంత్రి హరిష్రావు సవాల్ విసిరారు. కరీంనగర్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగిందని అప్పుడు ఇప్పటి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ సైతం లోక్సభ సభ్యుడేనని గుర్తు చేశారు. 2013 భూ సేకరణ చట్టం రైతులను ముంచే విధంగా ఉందని పదే పదే వల్లేవేస్తున్న మంత్రి హరిష్రావు కేసిఆర్ ఆ చట్టానికి ఆమోదం ఎలా తెలిపి ఓటు వేశాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట కాలయాపన చేస్తు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హరిష్రావుకు తగదని సూచించారు. తాజాగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉభయసభలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్టప్రతి ఆమోదం జరిపి రైతులను, భూ నిర్వాసితుల నోట్లో మట్టికొట్టె చర్యలకు టిఆర్ఎస్, బిజెపిలు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న వాటికంటే భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామన్నారు. ఏ ఒక్క నిబంధన రైతులకు హని కలిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.