ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరాణిక నాటకాలలో రాణిస్తున్న రిటైర్డు తహశీల్దార్‌ దానప్ప

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:27 AM

  జోగుళాంబ గద్వాల, మేజర్‌న్యూస్‌.  కళారూపాలను వెలికితీసి తన కళను ప్రజలకు ప్రదర్శిస్తు పలువురు మన్ననలు పొందుతున్నాడు రిటైర్డు తహసీల్దార్‌ దానప్పనాయక్‌. రాముడు, ఆంజనేయుడు, అర్జునుడు పాత్రలు వేసి పలువురుచే శభాష్‌ అనిపించుకున్న దానప్ప గత 15 సంవత్సరాలుగా పౌరాణికనాటకాలు వేసి అందరిచే మెప్పు పొందాడు. మల్దకల్‌ మండలం మద్దెలబండతాండకు చెందిన కిష్టానాయక్‌,లక్ష్మిల కుమారుడైన దానప్ప చిన్ననాటినుండే నాటకాలపై మక్కువ కలిగి ఉండేది. 1985 వరకు పటేల్‌ గా పనిచేసిన దానప్ప ఎన్టీఆర్‌ హయాంలొ పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతొ ఆయన కుటుంబం ఇబ్బందుల్లొ పడింది.అనంతరం గ్రామకార్యదర్శిగా ఆయనకు దౌల్తాబాద్‌ కు పదవీ బాద్యతలు అప్పగించారు. దీంతొ అప్పటి నుండి విధులు అంకితభావంతొ పనిచేస్తు ఉన్నత శిఖరాలను అధిరొహిం చాడు. ఆర్‌ఐగా, డిటిగా , తహసీల్దార్‌ గా బాద్యతలు స్వీకరించి ప్రజల మన్ననలు పొందడమే కాక నాటకరంగంలొ రాణిస్తు పలువురు కళాకారులు, కళాభిమానుల ఆదరణ పొందారు. 2010లొ జిల్లా కేంద్రంలొని టౌన్‌ హాల్‌ లొ నాటక ప్రదర్శన ఇచ్చి సన్మానం పొందారు. గట్టు మండలంలొ జరిగిన ప్రదర్శనలొ సత్యహరిశ్చంద్ర కాటిసీను రక్తికట్టించి పలువురు మన్ననలు పొందారు. 2011లొ గద్వాల బాలభవన్‌ లొ అర్జునుడు, ఆంజనేయుడు పాత్రలొ రాణించాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com