న్యూఢిల్లీ: పెట్రో ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్ లీటర్కు 2.16 పైసలు, డీజిల్ లీటర్కు 2.10 పైసలు తగ్గింది. ఈ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఆయిల్ కంపెనీలను అనుసరించి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఆయిల్ కంపెనీల సమాఖ్య తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకోవడంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా బ్యారెల్ ధర 50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పెట్రో ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు అప్పగించినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సవరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం పట్టడంతో పెట్రో ధరలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.