హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అధ్యక్షతన ఐకాస ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నిరుద్యోగ సమస్యలు… తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సోమవారం 3గంటలకు విద్యార్థి యువజన సంఘాలతో సమావేశానికి నిర్ణయించారు. సుధీర్ కమిటీ సిఫార్సుల అమలు కోసం జిల్లాల్లో సదస్సులను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1న మహబూబ్నగర్, 4న నిర్మల్, 5న కరీంనగర్, 11న వరంగల్లో సదస్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మైనార్టీల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు.