కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో పది లక్షల సీడ్ బాల్స్ చల్లుతామని హరిత హారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఇతర రాష్ర్టాలలో సీడ్ బాల్స్ ద్వారా అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకం విజయవంతం అయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాజీపేట్ మండలం మడికొండ సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో సీడ్ బాల్స్ తయారీ కేంద్రాన్ని ప్రియాంక వర్గీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.