ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 02:23 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవము రోజున సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రతి జిల్లాకు 5 లక్షలు అందించాలని ప్రభుత్వ నిర్ణయించిందని,  ఏదైనా జిల్లాలో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించదలచుకుంటే అధనంగా మరో 5 లక్షలు ఇవ్వనున్నట్లు కలేక్టర్లకు వెల్లడించారు . వృద్ద కళాకారుల పేన్షన్ల ప్రతిపాధనలను జూన్‌ 25 లోపు పంపాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా మరో 500 పెన్షన్లు ను సిఎం కెసిఆర్‌ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతిపాదనలు  జిల్లాల కలేక్టర్లు వేంటనే పంపించాలని ఆదేశించారు. 2014,2015 మరియు 2016 వ రాష్ట్ర అవతరణ దినోత్సవము, బతుకమ్మ వేడుకల నిర్వహాణ కోసం జిల్లాలకు అందించిన నిధులకు సంబందించిన వినియోగ  పత్రాలను ఈ నెల 24 లోపు  రాష్ట్ర  సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ కు పంపించాలని కలేక్టర్లకు సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్సు లో  కలేక్టర్ల కు  ప్రభుత్వ సలహాదారులు డా. రమణా చారి, పర్యటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశంలు దిశానిర్దేశనం చేసారు. ప్రపంచ తెలుగు మహాసభలు అక్టోబర్‌ - 22  దసరా పండుగ రోజున జరుపుటకు ప్రభుత్వం నిర్ణయించిందని కలేక్టర్లకు వేల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహాణ పురస్కరించుకోని  జిల్లాలలో ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని కలేక్టర్ల కు సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల కోసం జిల్లాలలో భాషా పండితులు, సాహితివేత్తల తో చర్చలు జరిపి తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలన్నారు ప్రభుత్వ సలహాదారులు డా . రమణా చారి. 2018 సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ పతంగుల పండుగ ను అన్ని జిల్లాలలో నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. గత కైట్‌ ఫేస్టివల్‌  ను హైదరబాద్‌ , వరంగల్‌ ఆర్భన్‌ , యాదాద్రి - భువనగిరి, కరీంనగర్‌ లలో నిర్వహించామన్నారు. వచ్చే కైట్‌ ఫేస్టివల్‌  ను రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా కేంద్రాలలో నిర్వహించేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని బుర్ర వేంకటేశం కలేక్టర్ల కు  సూచించారు.అందుకు తగిన  వేదిక , కైట్‌ ప్లేయర్స్‌ కు రవాణా, సౌకర్యాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని, ఆందుకు తగిన విధంగా సన్నదం కావాలన్నారు.


 జూన్‌ 2 న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత వైభవంగా  ఉద్యమ స్పూర్తి ని కోనసాగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలేక్టర్ల కు సూచించారు. ఆదే రోజు జిల్లా కలేక్టర్లు ప్రభుత్వ కార్యాలయాలలో,ప్రభుత్వ ఆసుపత్రులలో, అనాథాశ్రమాలలో పండ్లు, మిఠాయిలు , రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com