ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 02:25 AM

హెచ్‌ఐసీసీలో జరిగిన పోలీసుల ప్రత్యేక సమావేశంలో హొంమంత్రి నారుుని నర్సింహారెడ్డి


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నెంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని హెచ్‌ఐ సీసీలో పోలీసుల ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో హోంమంత్రి నాయిని మాట్లాడుతూ సీసీ కెమెరాలతో హైదరాబాద్‌ నగరంలో నేరాల శాతం తగ్గింద న్నారు. పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోటా నుంచి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. చైన్‌స్నాచర్లపై పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేశామన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తులను చేసి వాటిని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కార్పోరేట్‌ స్థాయిలో పోలీస్‌స్టేషన్‌ బిల్డింగ్‌ కడుతున్నామన్నారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో పోలీసుల తీరులో చాలా మార్పు వచ్చింది. రాష్ట్ర గ్రేహౌండ్స్‌ పనితీరుపై, తెలంగాణ పోలీసులు బెస్ట్‌ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశం సలు కురిపించిన విషయం గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నెంబర్‌వన్‌గా ఉంది. సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు పిలుపునిచ్చారు. హుక్కాసెంటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహించాలి. పోలీసులు నిజాయితీగా పనిచేయాలి. పోలీసులు రివాల్వ ర్లతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీసులు ఒత్తిడికి గురైతే ఉన్నతాధికారులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్‌శాఖలో ఆత్మహత్యలు ఉండొద్దని హితవు పలికారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com