-నా కుమారుడు తిరిగివస్తాడు: చిదంబరం
చెన్నై: ఎయిర్సెల్ మాక్సిస్ 2జీ స్కామ్, పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబ డులకు అనుమతులు ఇప్పించి లం చాలు తీసుకున్నారన్న కేసులో ఆరో పణలు ఉన్నాయంటూ, సీబీఐ దాడులు చేసిన కేంద్ర హోమ్, ఆర్థిక శాఖల మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం లండన్ పారిపోయారు. ఆయన గురువారం లండన్ వెళ్లిపోయారని చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు ధ్రువీకరించారు. అతని పాస్పోర్టుపై ఆంక్షలేమీ లేకపోవడంతోనే ఆపలేకపోయామని తెలిపారు. కార్తీపై తాజాగా ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐబీపీ క్లియరెన్స్ ఇప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా మూడు రోజుల క్రితం ఆయన ఇంటిలో సోదాలు కూడా జరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతుండగానే ఆయన లండన్కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయమైంది. కార్తి చిదంబరం వ్యవహారం విజయ్ మాల్యా వ్యవహారాన్ని గుర్తుకు తెస్తోంది. తన కుమారుడు కార్తి చిదంబరం కొన్ని రోజుల తరువాత తిరిగి ఇండియాకు వస్తాడని కేంద్ర హోమ్, ఆర్థిక శాఖల మాజీ మంత్రి పి చిదంబరం వెల్లడించారు. కార్తి లండన్కు చెక్కేశారని, మరో మాల్యా అయ్యారని మీడియాలో వస్తున్న వార్తలపై చిదంబరం స్పందించారు. కార్తి లండన్ ప్రయాణం ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని, టిక్కెట్లు కూడా ఎప్పుడో కొన్నవేనని వెల్లడించిన చిదంబరం ఆయన ప్రయాణంపై ఎటువంటి నిషేధాలు లేవని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐని ప్రయోగించిందని, కార్తితో పాటు అతని స్నేహితులనూ ఇబ్బంది పెట్టడమే వారి లక్ష్యమని చిదంబరం ఆరోపించారు.