హైదరాబాద్, మేజర్న్యూస్ : దక్షిణాది రాష్ట్రాలలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ రూపొందించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి పార్టీ జాతీ య అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపా రు. ఈమేరకు శనివారం పార్టీ కార్యాలయంలో బీజేపీ పబ్లిసిటీ సెల్ రాష్ట్ర కన్వీ నర్గా పెరిక సురేష్ను నియమిస్తూ డాక్టర్ లక్ష్మణ్ ఆయనను అభినందించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పేరాల శేఖర్ రావు, బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిల సమక్షంలో పెరిక సురేష్కు డాక్టర్ లక్ష్మణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లా డుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశా న్ని అభివృద్ది వైపు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. ఆయన చేపడుతున్న అభివృద్ది పథకాలను ప్రజలకు చేరవేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. అనంతరం పెరిక సురేష్ మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. ఆయన చేపడుతున్న పలు సంస్కరణలకు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలుపడం హర్షనీయమన్నారు. రాబోయే ఎన్ని కలలో తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కాగా సురేష్ గతంలో బీజేపీ నేషనల్ ఎకానమిక్ ఫోరం కో-ఆ ర్డినేటర్గా, ఎంటర్ ప్రెన్యూర్ సెల్ స్టేట్ కన్వీనర్గా ఎపి వినియోగదారులు, పౌరసరఫరాలశాఖ నామినేటెడ్ సభ్యులుగా పలువిభాగాలలో పనిచేశారు.