హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వెళ్లే క్యాత్ వే పసిఫిక్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ముప్పు తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన పది నిమిషాలకే విమానానికి పక్షి తగిలింది. దాంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ విమానంలో 244 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.