తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు. తక్షణమే భూసేకరణను పూర్తి చేసి, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీటిని అందించడం. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని అందించడం. ఈ నాలుగు అంశాలే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ విజయాన్ని సాధించి పెడతాయని ఆయన భావిస్తున్నారు.