ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో పరువు నష్టం దావా వేశారు. కోర్టులో తన పరువుకు భంగం కలిగించినందుకు కేజ్రీవాల్ రూ.10 కోట్లు చెల్లించాలంటూ జైట్లీ దావాలో పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ క్రికెట్ కంట్రోల్ బోర్టు వ్యవహారంలో కేజ్రీవాల్, జైట్లీల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో తన పరువుకు భంగం కలిగిందని సీఎం కేజ్రీవాల్ పై జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది రాం జెఠ్మలానీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ జైట్లీని నిజాయితీలేని వ్యక్తి అంటూ సంభోదించారు. దీంతో మరోసారి తన పరువుకు నష్టం వాటిల్లిందని జైట్లీ దావా వేశారు.