నల్లగొండ: నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తెరట్పల్లికి చేరుకున్నారు. చండూర్ మండలం తెరట్పల్లిలో అమిత్షా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. తెరట్పల్లిలో ఇంటింటికి తిరిగి కేంద్రపథకాల ప్రాముఖ్యతను ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్షా సమావేశం కానున్నారు. అమిత్ షా వెంట బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.