ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సకాలంలో ప్రజా సమస్యలపై స్పందించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 02:42 PM

ప్రణాళికాబద్ధంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే మున్సిపల్‌  అధికారులు వారి సమస్యల పట్ల సకాలంలో స్పందించాలని సూచించారు. నిజాయితీగా పనిచేసినప్పుడే హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌  ముగింపు కార్యక్రమానికి మేయర్‌ హాజరయ్యారు. హైదరాబాద్ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com