దీన్ దయాళ్ సిద్ధాంతాలు మోడీ ఆశయాలు ప్రజలకు చేరువయ్యేలా చెయ్యాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కార్యకర్తలకు సూచించారు. నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం తేరటుపల్లిలో పర్యటించిన ఆయన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశమంతా సాగుతున్న అభివృద్ధి తెలంగాణకు చేరాలన్నారు. ఆ దిశలో కార్యకర్తలు పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకోవాలన్నారు. పర్యటన సందర్భంగా మావోయిస్టుల చేతిలో హతమైన మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.