ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ శాఖ కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నాం: పోచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 03:35 PM

వ్యవసాయ శాఖ ఆధునీకీకరణలో భాగంగా డిజిటలైజ్ చేయనున్నట్టు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రంలో మొదటి విడత విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్‌లో రైతుల రివాల్వింగ్ ఫండ్ కింద రూ.500 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. వ్యవసాయ శాఖలో ఏఈవోలు సహా 3500 మందికి ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సాగులో నష్టాలు తప్పాలంటే రసాయన ఎరువులపై పెట్టుబడి తగ్గించాలన్నారు. గ్రామ రైతు సంఘాల ఆధ్వర్యంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com