నీటి పారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల పురోగతి, భూసేకరణ చట్టంపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా భూసేకరణ చట్టంపై గెజిట్ జారీ అయిన నేపథ్యంలో భూసేకరణ విధివిధానాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, సీఎంవో, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.