హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండటానికి చంద్రబాబే కారణమని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసార పాలనతో రాష్ట్రం అప్పుల వూబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నాపంల్లి ఎగ్జి బిషన్ మైదానంలో జరుగుతున్న తెదేపా మహానాడు ప్రాంగణంలో ఆయ న మాట్లాడారు. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తూ రాజకీయ నియం తగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని రమణ విమర్శించారు. కేసీఆర్ మాటతో పత్తి కాకుండా ఇతర పంటలు వేసినప్పటికీ రైతులు గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రమణ తెలిపారు. రైతు ఆత్మ హత్యలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు కూడా సీఎంకు తీరికలే కుండా పోతుందన్నారు. తెదేపా పోరాటం వల్లే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహరం లభించిదన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు నిర్మించిన సైబరాబాద్ వల్లే తెలం గాణ ధనిక రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య క్షుడు ఎల్. రమణ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న టీ టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ టీడీపీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఎంతో మందికి పార్టీ రాజకీయ జీవితాన్నిచ్చిందన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేయలేదని, గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు!