ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు తరలిరండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:35 AM

హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : అమెరికాలో మూడో రోజు రాష్ట్ర పరిశ్ర మలు, ఐటీ, మున్సిపల్‌, చేనేత జౌళి,మైనింగ్‌శాఖా మంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖర్‌రావు అమెరికాలో వివిధ పారిశ్రామిక వర్గాలతో వరుస సమావేశాలు నిర్వ హిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం గా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఆయన నోకియా, ఎరిక్సన్‌ కం పెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగస్వా మ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ విజ్ఞప్తికి స్పందించిన నోకియా ఫైబర్‌ గ్రిడ్‌పై ఆసక్తి కనబర్చింది. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం జారీ చేయబోయే ఆర్‌ఎఫ్‌పీలో పాల్గొంటామని తెలిపింది. డేటా అనలిటిక్స్‌ పార్కులో మొబైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు. అంతకుముందు, కాలిఫోర్నియాలో యూఎస్‌ ఇం డియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, టీఎస్‌ ఐపాస్‌ విశిష్టతలు, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను ఆయన వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు , ప్రాధాన్యతలను అక్కడి పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ వివరించారు. సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీ ప్రతినిధులతోనూ సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. సేల్స్‌ ఫోర్స్‌ స్పీకర్‌ సీరిస్‌లో కంపెనీ పబ్లిక్‌ పాలసీ హెడ్‌తో సమావేశమైన ఆయన మేక్‌ ఇన్‌ ఇండియా సహా రాష్ట్రంలో పెట్టుబ డులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై నోకియా ఆసక్తి కనబరిచింది. నోకియా, ఎరిక్‌సన్‌ కంపెనీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. సెల్స్‌ ఫోర్సు ’పైర్‌ సైడ్‌ చాట్‌’ సెషన్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మ్యూల్‌ సాఫ్ట్‌, స్రైప్‌ కంపెనీలతో ఆయన చర్చలు జరిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com