విశాఖపట్నం : కాంగ్రెస్ ఆధిపత్యమే రాజ్య మేలుతున్న రోజులలో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పునాదులను కదిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని చెప్పిన మహా మనీషి నందమూరి తారకరామారావు అని చంద్రబాబు అన్నారు.