హైదరాబాద్ బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సైట్ 1తో పాటు రాధాకృష్ణ నగర్ లో ఫుట్ పాత్ పనులకు భూమి పూజ నిర్వహించారు. మధురానగర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీల్లో మన కూరగాయల పథకాన్ని ప్రారంభించారు.