వేములవాడ: దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్యం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు కావడం.. స్వామివారికి ప్రీతపాత్రమైన రోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దుచేసి భక్తులకు లఘుదర్శనం కల్పించారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తడిబట్టలతో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.