అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మిస్సిసిపీలో ఓ దుండగుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. మూడు ఇళ్లల్లోకి చొరబడ్డ అగంతకుడు.. స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.