పెక్స్ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫెయిర్ కు హాజరైన వాళ్లలో నుంచి లక్కీ డిప్ ద్వారా విజేతలను ఆయన ఎంపిక చేశారు. వారికి ల్యాప్ టాప్ లను బహుకరించారు. ఫెయిర్ లో పాల్గొన్న కాలేజీల యాజమాన్యాలకు మెమొంటోలు అందజేశారు.మూడు రోజులపాటు జరిగిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో వందకు పైగా కాలేజీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. లక్ష మందికి పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి స్టాల్స్ ని సందర్శించి కాలేజీల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులు, కెరీర్ గైడెన్స్ సెషన్స్ విద్యార్థులకు అవగాహన కల్పించాయి.ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్ తో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టి న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, వివిధ కాలేజీల యాజమాన్యాలు పాల్గొన్నాయి.