హైదరాబాద్: లాటీన్ అమెరికా, ఆఫ్రికా దేశాలను వణికించిన జికా వైరస్ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో బాపూనగర్కు చెందిన ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించింది. బాధితుల్లో ఇద్దరు గర్భిణీలు ఇటివలే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చారని గురురాత్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. జికా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు