ముంబయి: సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్.. వీరిద్దరిలో ఎవరు బాగుంటారు అని అడిగితే.. ఠక్కున సల్మాన్ అనే చెప్తారు. కానీ సల్మాన్ కంటే జాకీ ష్రాఫే బాగుంటాడు అంటోంది మనీషా కొయిరాలా. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో డియర్ మాయా, సంజయ్ దత్ బయోపిక్లు ఉన్నాయి.సంజయ్ దత్ చిత్రంలో మనీషా సంజయ్ తల్లిగా నటిస్తోంది. అయితే ఒకప్పుడు మనీషా సల్మాన్, జాకీ ష్రాఫ్తో చాలా సినిమాల్లో నటించింది. ఈ సందర్భంగా మీడియా సల్మాన్, జాకీల్లో ఎవరు బాగుంటారు అనడిగితేఇప్పుడంటే సల్మాన్ మేనియా నడుస్తోంది.. కానీ ఒకప్పుడు సల్మాన్ కంటే జాకీనే బాగుండేవాడు అని చెప్పింది. ఆమె సమాధానంతో ఒక్కక్షణం పాటు అక్కడి విలేకర్లు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారట.మనీశా ప్రధాన పాత్రలో నటించిన డియర్ మాయా చిత్రం జూన్ 2న విడుదల కాబోతోంది.