స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జగన్నాథం. జూన్ 23న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పూజారి పాత్రలో బన్నీ కనిపించనుండగా, ఆయన సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేసిన టీం ఈ రోజు సాయంత్రం 6 గం.లకు గుడిలో బడిలో మడిలో అనే సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. విజయవాడ రాడీయిజం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తుండగా.. అన్యాయం, అక్రమాలను అస్సలు సహించని వ్యక్తి అక్రమార్కుల పాలిట మృత్యు నాదంగా ఎలా మారతాడు అనే నేపథ్యంలో సినిమా రూపొందుతున్నట్టు సమాచారం.