ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహానటి షూటింగ్ ప్రారంభమైంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2017, 02:41 PM

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ ప్రారంభమైంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ నిర్మిస్తున్నారు.భారతీయులు గర్వించదగ్గ నటీమనుల్లో మహానటి సావిత్రి ఒకరు. గత కొద్దిరోజులుగా ఈ మహానటి జీవిత కథ ఆధారంగా బయోపిక్ మూవీని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. కాగా సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేయడానికి సిద్ధపడ్డాడు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అభిమానులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈరోజు (సోమవారం) ఉదయం ‘మహానటి’ మూవీ రామ‌కృష్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. తొలి షాట్‌ని లెజండ‌రీ యాక్ట‌ర్స్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ఫోటోల‌పై తీసారు.


సావిత్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. సమతకు భర్తగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com