కులవృత్తులపై అసెంబ్లీలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి. గత పాలకులకు ఎన్నికలు వస్తేనే కులవృత్తులు గుర్తుకొచ్చేవని.. సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా కులవృత్తుల అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అసెంబ్లీ వేదికగా నిర్ణయం ప్రకటించారని చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన గొర్లకాపర్ల కృతజ్ఞత సభలో ఆమె మాట్లాడారు.కుల వృత్తులను కాపాడేందుకు, వారిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. గత పాలకులు గొర్రెల కాపరులను ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. పేదలను అభివృద్ధి చేయడానికి, ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.ఈ సభలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.